ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్య భూమి పూజ ఆహ్వానాన్ని అందుకున్న తెలంగాణ సంగ్రాం మహారాజ్

ABN, First Publish Date - 2020-08-02T19:14:11+05:30

అయోధ్యలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సంగ్రాం మహారాజ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణఖేడ్ : అయోధ్యలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సంగ్రాం మహారాజ్‌కు ఆహ్వానం అందింది. ఈయన అఖిల భారత సాధుసంతుల రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యతల్లో ఉన్నారు. దీంతో పాటు నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయ పీఠాధిపతిగా ఉన్నారు. తెలంగాణ నుంచి తనకే ఆహ్వానం అందిందని తెలిపారు. ఈ నెల 3 న హైదరాబాద్ నుంచి బయల్దేరడానికి విమాన టిక్కెట్లను సైతం పంపారని ఆయన వెల్లడించారు.


కరసేవ, రామజ్యోతి, శిలాన్యాస్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 5 జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ ఆనందీబేన్ పటేల్, సీఎం యోగి, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు మరో 50 మంది సాధు సంతులు కూడా హాజరవుతున్నారు. ఈ 50 మంది సాధు సంతువుల్లో సంగ్రాం మహారాజ్ ఒకరు. 

Updated Date - 2020-08-02T19:14:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising