ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కథా రచయిత కరుణాకర్‌ కన్నుమూత

ABN, First Publish Date - 2020-07-21T08:57:32+05:30

ప్రముఖ రచయిత, బీహెచ్‌ఈఎల్‌ విశ్రాంత ఉద్యోగి బండారు కరుణాకర ప్రసాద్‌ (77) కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూలై20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, బీహెచ్‌ఈఎల్‌ విశ్రాంత ఉద్యోగి బండారు కరుణాకర ప్రసాద్‌ (77) కన్నుమూశారు. కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు. బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ఫైనాన్స్‌ శాఖలో మేనేజర్‌గా 2004లో పదవీ విరమణ చేశారు. ‘బీపీ కరుణాకర్‌’ అనే కలం పేరుతో కథా రచనలు చేసిన ఆయన.. ‘కార్డు’ కథలు, ‘కాలమ్‌’ కథలు వంటి వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఆయన కలం నుంచి ‘అంబాలిస్‌’, ‘నిర్నిమిత్తం’, ‘రెల్లు’, ‘డియర్‌’, ‘రజితం’ వంటి పలు కథాసంపుటిలు వెలువడ్డాయి. మరెన్నో కథలు పలు వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంగళవారం బోయిగూడలోని శ్మశాన వాటికలో బీపీ కరుణాకర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

Updated Date - 2020-07-21T08:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising