ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌పై మోదీకి సవతి ప్రేమ

ABN, First Publish Date - 2020-11-23T08:19:22+05:30

అధికారం కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీని చూస్తుంటే అసహ్యం వేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరీశ్‌

పటాన్‌చెరు, నవంబరు 22: అధికారం కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీని చూస్తుంటే అసహ్యం వేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయని ఆరోపించారు. తమ వర్గాలకు టికెట్లు రాలేదని ఆ పార్టీ కార్యాలయంలో అంగీలు, లాగులూ చింపుకొంటున్నారన్నారు.


ఆదివారం రాత్రి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో ఆయన ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌పై సవతి ప్రేమను చూపిస్తున్నా ఇక్కడి బీజేపీ నాయకులకు అడిగే ధైర్యం లేదని మండిపడ్డారు. బెంగుళూరుకు వరదలు వస్తే రూ.600 కోట్లు, గుజరాత్‌లో వరదలు వస్తే రూ.500 కోట్లు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్‌లో వరదలు వస్తే ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌ ప్రజలు బ్యాలెట్‌ ద్వారా  బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2020-11-23T08:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising