శ్రీనివాస్గౌడ్ మానవత్వం
ABN, First Publish Date - 2020-03-27T11:16:03+05:30
రోడ్డునే ఆవాసంగా చేసుకొని జీవిస్తున్నారా తల్లీకొడుకులు. వృద్ధురాలైన ఆమె బిచ్చమెత్తుకుంటుంటే.. కొడుకేమో ఓ వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఈ వృద్ధురాలు ప్రాణం
యాచకురాలిమృతదేహం ఉన్న స్ట్రెచర్ను
అంబులెన్స్లోకి ఎక్కించిన మంత్రి
మహబూబ్నగర్, మార్చి 26: రోడ్డునే ఆవాసంగా చేసుకొని జీవిస్తున్నారా తల్లీకొడుకులు. వృద్ధురాలైన ఆమె బిచ్చమెత్తుకుంటుంటే.. కొడుకేమో ఓ వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఈ వృద్ధురాలు ప్రాణం విడిచింది. పూటగడవడమే కష్టమైన ఆ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించే స్థోమత ఉంటుందా? ఈ విషయం తెలిసి రాష్ట్ర మంత్రి శ్రీనివా్సగౌడ్ చలించిపోయారు. స్వయంగా వైద్యులు, ఇతర సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. స్ట్రెచర్పై ఉన్న మృతదేహాన్ని స్వయంగా అంబులెన్స్లోకి ఎక్కించారు.
అంత్యక్రియల కోసం కుమారుడికి డబ్బు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. జడ్చర్లకు చెందిన యాద మ్మ(70) చాలా ఏళ్ళక్రితం పాలమూరుకొచ్చి బిచ్చమెత్తుకొంటూ బతుకుతోంది. ఆమె కుమారుడు రాజు వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తుంటాడు. గురువారం ఉదయం యాదమ్మ ప్రాణాలు విడిచింది. మంత్రి శ్రీనివా్సగౌడ్ అక్కడికి చేరుకొని వైద్యులను పిలిపించి పరిశీలించారు. బంధువులు ఎవరూ లేరని తెలుసుకొని ఆంబులెన్స్లో అంత్యక్రియలకు తరలించారు.
Updated Date - 2020-03-27T11:16:03+05:30 IST