ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23న ఢిల్లీలో బీసీల జనగణన గర్జన: జాజుల

ABN, First Publish Date - 2020-03-13T09:19:15+05:30

వచ్చే నెల 15 నుంచి చేపట్టనున్న జనగణనలో ప్రత్యేకంగా బీసీ కులాల గణనను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, మార్చి12 (ఆంధ్రజ్యోతి) : వచ్చే నెల 15 నుంచి చేపట్టనున్న జనగణనలో ప్రత్యేకంగా బీసీ కులాల గణనను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఢిల్లీలో 23న బీసీల జనగణన గర్జన పేరుతో పార్లమెంట్‌ను ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బీసీల జనగణన గర్జన వాల్‌పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలపై  కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లైనా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించలేదని ధ్వజమెత్తారు. 23న చేపట్టనున్న జనగణన గర్జనకు 28 రాష్ట్రాల నుంచి బీసీలు తరలివస్తారని చెప్పారు.

Updated Date - 2020-03-13T09:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising