పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణకు నీటి కరువు: బండి సంజయ్
ABN, First Publish Date - 2020-06-02T00:21:37+05:30
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో నికర జలాలు కోల్పోతామని బీజేపీ నేత బండి సంజయ్ చెప్పారు. పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణకు నీటి కరువు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో నికర జలాలు కోల్పోతామని బీజేపీ నేత బండి సంజయ్ చెప్పారు. పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణకు నీటి కరువు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్ నామమాత్రంగా కృష్ణాబోర్డుకు లేఖ రాశారని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందని చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు ఇచ్చిన వాటా దక్కలేదని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించాలని కోరారు. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని తప్పుబట్టారు. బీజేపీ పోరాటం వల్లే కృష్ణా, గోదావరి బోర్డు సమావేశం నిర్వహించాలని కేంద్రం ఆదేశించిందని సంజయ్ తెలిపారు.
Updated Date - 2020-06-02T00:21:37+05:30 IST