సిరిసిల్ల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ
ABN, First Publish Date - 2020-02-22T08:05:43+05:30
సిరిసిల్ల ఎస్సీ హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జ్యోత్స్న డిమాండ్ చేశారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల ఎస్సీ హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జ్యోత్స్న డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్అలీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నిందితుడిని పోలీసు కస్టడీకి ఎందుకు అడగలేదని నిలదీశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-02-22T08:05:43+05:30 IST