సింగూర్ ప్రాజెక్టుకు జలకళ..
ABN, First Publish Date - 2020-10-07T20:10:18+05:30
సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. మూడేళ్ల తర్వాత నీటితో కలకళలాడుతోంది.
సంగారెడ్డి జిల్లా: సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. మూడేళ్ల తర్వాత నీటితో కలకళలాడుతోంది. ప్రాజెక్టులోకి 25 టీఎంసీల నీరు చేరింది. మరో 5 టీఎంసీల నీరు వస్తే డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పర్యాటకుల సందడి పెరిగింది. పెద్ద సంఖ్యలో జనం సింగూరును సందర్శిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కువగా పర్యాటకులు వెళుతున్నారు. అయితే స్థానికంగా వసతి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు దగ్గర ఓ పార్కును నిర్మించినా వరద నీటికి అది పూర్తిగా ధ్వంసమైంది. దీంతో సింగూరు పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు, సందర్శకులు కోరుతున్నారు.
Updated Date - 2020-10-07T20:10:18+05:30 IST