బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు: సీఎండీ
ABN, First Publish Date - 2020-05-13T09:49:13+05:30
రాష్ట్రంలో జూలై వరకు కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉందని, అయినప్పటికీ బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్
హైదరాబాద్/ కొత్తగూడెం, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జూలై వరకు కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉందని, అయినప్పటికీ బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో మంగళవారంఉన్నతస్థాయి అధికారులతో బొగ్గు ఉత్పత్తి, రవాణాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో విద్యుత్తు సంస్థలకు బొగ్గు సరఫరా చేయగలిగినప్పటికీ, ఇతర పరిశ్రమలు మూతపడి ఉన్నందున వాటికి సరఫరా చేయడం సాధ్యం కావడంలేదని, పరిశ్రమలు తెరుచుకోగానే చాలినంత బొగ్గును వాటికి అందించాలని గుర్తు చేశారు.
పని చేసే ప్రదేశాలలో కార్మికులు భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కాగా, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు పెన్షన్ పథకంతోపాటు పీఎఫ్ సౌకర్యం కల్పించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. .
Updated Date - 2020-05-13T09:49:13+05:30 IST