కరోనా వ్యాప్తి నివారణకు ఎస్బిఐ తన వంతుసాయం
ABN, First Publish Date - 2020-05-29T22:05:59+05:30
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా తామూ తమకు తోచిన రీతిలో సాయం అందిస్తున్నట్టు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓ పి మిశ్రా అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా తామూ తమకు తోచిన రీతిలో సాయం అందిస్తున్నట్టు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓ పి మిశ్రా అన్నారు. శుక్రవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ను కలిసి ఎస్బఇఐ తరపున పీపీఈ కిట్స్ బాక్సులను ఆయనకు అందజేశారు. అలాగే కరోనా బాధితులకు ఆహార సరఫరా, ఆసుప త్రులకు వైద్య పరికాలు తదితర కార్యక్రమాలను నిర్యహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ ఎస్బిఐ ఒక కోటి ఒక లక్ష రూపాయల సాయం అందించిందని తెలిపారు. అలాగే తాజాగా అందజేసిన కిట్లను గాంధీ, ఉస్మానియా, ఎంజిఎం, నిజామాబాద్, నల్గొండలోని జనరల్ హాస్పిటల్స్కు అందించాలని కోరారు. సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిజిఎం కెవి బంగార్రాజు, హనుమంతరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-29T22:05:59+05:30 IST