ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారూ.. సకాలంలో నోటిఫికేషన్‌ ఇవ్వండి

ABN, First Publish Date - 2020-09-20T07:34:03+05:30

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో గ్రూప్‌-2 కోచింగ్‌ తీసుకొని ఏడాదిగా నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు, ఇక నోటిఫికేషన్‌ రాదేమోనన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చదివీ చదివీ మెదడు పోతోంది 

నిరుద్యోగి ఆవేదన.. ఆత్మహత్యాయత్నం 

సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సెల్పీ వీడియో  

ఉద్యోగ నోటిఫికేషన్‌ ఏడాదిగా నిరీక్షణ

విసిగి పురుగుల మందు తాగిన సంపత్‌

 

మిర్యాలగూడ అర్బన్‌, సెప్టెంబరు 19: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో గ్రూప్‌-2 కోచింగ్‌ తీసుకొని ఏడాదిగా నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు, ఇక నోటిఫికేషన్‌ రాదేమోనన్న బెంగతో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.


‘కేసీఆర్‌ సారూ.. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు కరువయ్యాయి. ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియదు.. ఇన్‌టైంలో నోటిఫికేషన్లు వేయండి సారూ. చదివీ చదివీ.. మైండంతా పోతోంది సారూ.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆత్మహత్యాయత్నం చేస్తున్నాను’  అంటూ ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనంతా వెళ్లగక్కాడు.

బాధితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సంపత్‌. ఓయూలో పీజీ పూర్తిచేసి గ్రూప్‌-2 కోసం చదువుతున్నాడు. తండ్రి సత్యనారాయణ టైలర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో సంపత్‌కు కోచింగ్‌ ఇప్పించాడు. ఏడాది కాలంగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ కాకపోవడంతో సంపత్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం పురుగులమందు తాగాడు.

ఆపస్మారకస్థితిలో పడి ఉన్న ఆయన్ను తల్లిదండ్రులు గుర్తించి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్‌ అయినా 6 నెలలలోపు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు.


Updated Date - 2020-09-20T07:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising