గ్రామాల్లో ప్రజలకు శానిటైజర్లు ఇవ్వాలి: భట్టి
ABN, First Publish Date - 2020-03-26T19:51:57+05:30
తెలంగాణలోని గ్రామాల్లో ప్రజలకు శానిటైజర్లు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్: తెలంగాణలోని గ్రామాల్లో ప్రజలకు శానిటైజర్లు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎల్పీ తరపున ఉచితంగా శానిటైజర్లు పంపిణీ చేస్తామన్నారు. ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించాలన్నారు. హాస్టళ్లు మూసివేస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు.
Updated Date - 2020-03-26T19:51:57+05:30 IST