ఎస్ఐపై రెచ్చిపోయిన మట్టి మాఫియా
ABN, First Publish Date - 2020-12-29T20:34:56+05:30
జోగులాంబ గద్వాల జిల్లా కాకులారం గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది.
జోగులాంబ గద్వాల జిల్లా కాకులారం గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. మట్టి తరలింపునకు అనుమతులు చూపించాలని అడిగిన గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిపై మట్టి మాఫియా అనుచరులు దాడి చేశారని పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా పరారయ్యారు. అక్కడే ఉన్న ఒక టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనను పోలీస్ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. దాడి చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంపై గద్వాల రూరల్ ఎస్ఐ వివరణ ఇచ్చేందుకు విముఖత చూపారు.
Updated Date - 2020-12-29T20:34:56+05:30 IST