ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే హడావిడి
ABN, First Publish Date - 2020-09-25T06:58:27+05:30
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నూతన రెవె న్యూ చట్టం పేరుతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నానా హడావిడి
ఎమ్మెల్యే గండ్రపై డీసీసీ అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి విమర్శ
భూపాలపల్లిటౌన్, సెప్టెంబరు 24: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నూతన రెవె న్యూ చట్టం పేరుతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నానా హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ జి ల్లా అధ్యక్షుడు ఐత ప్రశాష్రెడ్డి విమర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ రికార్డులను కేసీఆర్ ప్రభుత్వం తారు మారు చేసి ఆ నేరాన్ని రెవెన్యూ యంత్రాంగంపై మోపిందని ఆరోపించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే నూతన రెవెన్యూ చట్టం పేరుతో హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఈ చట్టం ద్వారా గండ్ర వెంకటరమణారెడ్డి లాంటి భూస్వాములకే ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు.
అందుకే కేసీఆర్ మెప్పు పొందేందుకు ఆయన ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారన్నారు. గతంలో వెంకటరమణారెడి రైతుకు మద్దతు ధర, రైతు భరోసాయాత్రలో కేసీఆర్పై చేసిన విమర్శలను గుర్తుకు తెచ్చుకోవాలని హితవుపలికారు. ట్రాక్టర్ ర్యాలీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించి ఉంటే రైతులు ఎంతో ఆనందించే వారన్నారు. ఈ కార్యక్రమంలో శశిభూషణ్, నర్సయ్య, తిరుపతి, సతీష్, చల్లూరి మధు, రాజేందర్, కుమారస్వామి, భువనసుదర్, సుదర్శన్, భట్టు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-25T06:58:27+05:30 IST