భూములపై ‘రెవెన్యూ’ తీర్పులు ఇవ్వొద్దు
ABN, First Publish Date - 2020-09-14T09:17:50+05:30
భూములపై ‘రెవెన్యూ’ తీర్పులు ఇవ్వొద్దు
- 7 తర్వాత ఇచ్చే ఉత్తర్వులేవీ చెల్లవు: సర్కారు
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూములపై ఈ నెల 7వ తేదీ తర్వాత రెవెన్యూ అధికారులు ఎలాంటి తీర్పులు ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 7 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చిందని గుర్తు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఈ నెల 7 నుంచి రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులేవీ చెల్లుబాటు కావన్నారు.
Updated Date - 2020-09-14T09:17:50+05:30 IST