కేటీఆర్ అవినీతిపై పోరాడినందుకే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు: ఉత్తమ్
ABN, First Publish Date - 2020-06-06T23:46:54+05:30
కేటీఆర్ అవినీతిపై పోరాడినందుకే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు: ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.111 జీవోకు వ్యతిరేకంగా కేటీఆర్ అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే కేబినెట్ నుంచి కేటీఆర్ తప్పుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ అవినీతిపై పోరాడిన రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని ఉత్తమ్ మండిపడ్డారు. 111 జీవోను ప్రభుత్వం సవరించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2020-06-06T23:46:54+05:30 IST