ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా తర్వాత వేగంగా భారత వృద్ధి

ABN, First Publish Date - 2020-05-17T09:56:12+05:30

భారత్‌లో మౌలిక సౌకర్యాలు, మానవ సంపత్తి పుష్కలంగా ఉన్నందున కరోనా సంక్షోభం ముగిసిన వెంటనే దేశ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పునరుత్తేజ చర్యలతో గాడిలోకి ఎకానమీ

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి


హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): భారత్‌లో మౌలిక సౌకర్యాలు, మానవ సంపత్తి పుష్కలంగా ఉన్నందున కరోనా సంక్షోభం ముగిసిన వెంటనే దేశ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో జరిగిన 142మంది ట్రైనీ సివిల్‌ సర్వెంట్ల ప్రత్యేక ఫౌండేషన్‌ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఆయన వర్చువల్‌ పద్ధతిలో ప్రసంగించారు. కరోనా సంక్షోభం ముగిసేటప్పటికి దేశీయ ఆర్థిక రంగం తీవ్ర ఒత్తిడిలో ఉంటుందని సుబ్బారావు చెప్పారు. అయితే అదే సమయంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదల, రూపాయిలో స్థిరత్వం, ఇబ్బడిముబ్బడిగా పంట ఉత్పత్తులు చేతికి వస్తాయని, ఇవన్నీ దేశానికి కలిసివచ్చే అంశాలని ఆయన తెలిపారు. ద్రవ్యలోటుపై అదనపు ఒత్తిడి పడకుండా వృద్ధిరేటును తిరిగి గాడిన పెడుతూ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే లక్ష్యంతో కొవిడ్‌-19పై పోరాటం చేయాల్సి ఉంటుందని సుబ్బారావు పిలుపునిచ్చారు. మార్కెట్లకు, పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించి ఆర్థిక రంగానికి పునరుత్తేజం కలిగించడానికి వినియోగం, ఉత్పత్తి, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

Updated Date - 2020-05-17T09:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising