పేదల వైద్యానికి ప్రభుత్వం చేయూత
ABN, First Publish Date - 2020-05-23T09:07:47+05:30
పేదల వైద్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మునిసిపాలిటీకి చెందిన
మంత్రి చామకూర మల్లారెడ్డి
కీసర రూరల్: పేదల వైద్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మునిసిపాలిటీకి చెందిన దిలీప్ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.60వేల చెక్కును శుక్రవారం మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగారం పంచాయతీ మాజీ వార్డుసభ్యుడు, నాయకుడు ఆంజనేయులుగౌడ్, కీసర ఎంపీపీ ఇందిర, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2020-05-23T09:07:47+05:30 IST