‘తెలంగాణ సోనా’కు మద్దతు ధర ప్రకటించాలి
ABN, First Publish Date - 2020-12-12T05:05:53+05:30
‘తెలంగాణ సోనా’కు మద్దతు ధర ప్రకటించాలి
పరిగి/కులకచర్ల: తెలంగాణ సోనకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని బీజేపీజిల్లా ఉపాధ్యక్షుడు వెంకటయ్యగౌడ్, రాముయాదవ్, కార్యదర్శి రాంచందర్ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ిపిలుపు మేరకు శుక్రవారం పరిగి,కులకచర్ల మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ అశోక్కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు కుటుంబాలకు ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి హరికృష్ణ, పెంటయ్య, బాలకిష్టారెడ్డి, ఆంజనేయులు,రమేశ్, వెంకట్, కుందేళ్లశ్రీశైలం, మైపాల్, సురేందర్గౌడ్, సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి, బందయ్య, చంద్రలింగం, శ్రీనివాస్, కె.మైపాల్, యాదయ్య, రాజశేఖర్, వెంకటేశ్, రైతులు పాల్గొన్నారు.
రైతు రుణమాఫీ వెంటనే చేయాలి
బంట్వారం: ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వెం టనే రైతు రుణమాఫీ చేయాలని బీజేపీ బంట్వారం మండలా ధ్యక్షుడు మహేష్యాదవ్ డిమాండు చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సిద్దార్థ, రాజు, వెంకటేష్, జగదీష్ పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మోమిన్పేట: అకాలవర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వంవెంటనే ఆదుకోవాలని బీజేపీ మోమిన్పేట మండలాఽ ద్యక్షుడు సాయిభుజంగరెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అంద జేశారు. ఈ ఈ కార్యక్రమంలో శ్రీశైలం, మురళి, ప్రవీణ్కుమార్, భాస్కర్రెడ్డి, హరిక్రిష్ణ, సంగుపటేల్, మాణిక్రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T05:05:53+05:30 IST