పేదలకు అండగా నిలవాలి
ABN, First Publish Date - 2020-04-09T10:22:49+05:30
లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు దాతలు అండగా నిలవాలని
ఇబ్రహీంపట్నం: లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు దాతలు అండగా నిలవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రె డ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి బుధవారం ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలకు చెందిన ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియా రిపోర్టర్లకు బియ్యం, సరుకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఇప్పటికే ప్రభుత్వం వలస కార్మికులకు బియ్యం అందజేసిందన్నారు. కార్యక్రమంలో మున్పిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, కమిషనర్ ఇసాక్ అబ్ఖాన్, దయాకర్రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2020-04-09T10:22:49+05:30 IST