రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN, First Publish Date - 2020-11-13T09:42:57+05:30
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోందని, వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకా లు తీసుకొచ్చిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో నాయకులు
షాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోందని, వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకా లు తీసుకొచ్చిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వ్యవసాయ మార్కెట్ క మిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినా్షరెడ్డిలతో కలిసి పా ల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా పొన్న స్వప్ననర్సింహారెడ్డి, వైస్చైర్మన్ గా డప్పు రాజు, డైరెక్టర్లు సూద యా దయ్య, రుక్మొద్దీన్, మంజుల, బాల్రా జ్, పెంటయ్య, వెంకట్రెడ్డి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రైతుల పక్షపాతిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తూ, దేశంలోనే అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మండలంలో పరిశ్రమలతో ఉద్యో గాలు, ఉపాధి లభిస్తాయన్నారు. ప్రపంచదేశాలు షాబాద్ వైపు చూసేలా పరిశ్రమలు నెలకొల్పుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ లక్ష్మి, సొసైటీ చైర్మ న్ శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావ్, టీఎల్ఎఫ్ లీగల్ అడ్వజర్ పి.సతీ్షరెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, మహేందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాజేందర్రెడ్డి, శ్రీనివా్సగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T09:42:57+05:30 IST