నేడు స్వర్ణభారత్ ట్రస్టుకు..
ABN, First Publish Date - 2020-02-22T11:11:45+05:30
నేడు స్వర్ణభారత్ ట్రస్టుకు..
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక
నేడు స్వర్ణభారత్ ట్రస్టుకు..
శంషాబాద్రూరల్ : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టుకు భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రానున్నట్లు ట్రస్టు సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు స్వర్ణ భారత్ ట్రస్టుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకుంటారని చెప్పారు. అనంతరం యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం పద్మ అవార్డు గ్రహీతలను వెంకయ్య నాయుడు సత్కరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని ట్రస్టు సభ్యులు కోరారు.
Updated Date - 2020-02-22T11:11:45+05:30 IST