రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN, First Publish Date - 2020-11-13T13:26:50+05:30
జిల్లాలోని తుర్క యాంజల్ మున్సిపాలిటీ అదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రంగారెడ్డి: జిల్లాలోని తుర్క యాంజల్ మున్సిపాలిటీ అదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. టాటా సఫారీ కారు...యమహా ఫాసినోను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తల్లి కొడుకుగా గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు రాగన్నగూడాలోని జీవీఆర్ కాలనీలో నివాసముండే సం రెడ్డి ప్రదీప్ రెడ్డి(19), సం రెడ్డి చంద్రకళ(48)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-11-13T13:26:50+05:30 IST