రాజేంద్రనగర్లో మరో కిడ్నాప్
ABN, First Publish Date - 2020-10-28T14:00:34+05:30
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మరో కిడ్నాప్ కలకలం రేపుతోంది.
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మరో కిడ్నాప్ కలకలం రేపుతోంది. 9వ నంబర్ ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన గౌస్ అనే వ్యక్తి కిడ్నాప్కు గురయ్యాడు. అతనికి రాజేంద్రనగర్లో మొదటి భార్య ఉండగా ఆమెకు పిల్లలు కాకపోవడంతో అక్కడి నుండి హైదరాబాద్లో మరో మకాం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొదటి భార్య బంధువులే కిడ్నాప్కు బాధ్యులై ఉంటారని రెండవ భార్య రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బావమర్థులే కిడ్నప్ చేసి ఉంటారని భార్య అనుమానం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు గౌస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2020-10-28T14:00:34+05:30 IST