రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం
ABN, First Publish Date - 2020-12-04T05:07:48+05:30
రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం
షాబాద్: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అంతారం గ్రామానికి చెందిన బాల్రాజ్ తన స్కూటర్పై ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన శరత్చంద్ర(11) అనే బాలుడితో కలిసి అంతారం వస్తున్నారు. సర్దాన్నగర్ మార్కెట్ సమీపంలో పక్కనుంచి వెళ్తున్న లారీని స్కూటర్ ఢీకొనడంతో వెనుక కూర్చున్న బాలుడు శరత్చంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన బాల్రాజ్ను 108లో షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Updated Date - 2020-12-04T05:07:48+05:30 IST