ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తిమృతి

ABN, First Publish Date - 2020-03-02T10:42:37+05:30

రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నారాయణపూర్‌ గ్రామానికి చెందిన రాములు (55) శనివారం ఆటోలో వికారబాద్‌ నుంచి తన స్వగ్రామానికి ఆటోలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆటో కొత్తగడికి రాగానే ఆటో ముందు భాగంలో కూర్చున్న రాములును పక్కనుంచి వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో రాములు కింద పడిపోయాడు. ప్రమాదంలో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని వికారాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు అక్కడ ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆదివారం రాములు చికిత్స పొందుతుండగా మృతిచెందాడు. భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.

Updated Date - 2020-03-02T10:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising