న్యాయం కోసం ధర్నా
ABN, First Publish Date - 2020-12-30T04:30:56+05:30
న్యాయం కోసం ధర్నా
నందిగామ: అన్యాయంగా తన ఇంటిని కూల్చిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నందిగామ మండలం జంగోనిగూడకు చెందిన జంగ బిక్షపతి తన కుటుంబీకులతో కలసి మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇల్లు కూల్చి 36గంటలవుతున్నా కూల్చిన వారిపై చర్యలు తీసు కోలేదన్నారు. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
Updated Date - 2020-12-30T04:30:56+05:30 IST