ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ బియ్యం అక్రమార్కుడిపై పీడీ యాక్ట్‌

ABN, First Publish Date - 2020-03-25T12:09:45+05:30

తాండూరులో రేషన్‌దారుల నుంచి ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని కరన్‌కోట్‌ పోలీసులు పట్టుకుని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌: తాండూరులో రేషన్‌దారుల నుంచి ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని కరన్‌కోట్‌ పోలీసులు పట్టుకుని పీడీయాక్ట్‌ కేసు నమోదు చేశారు. నిందితుడిని మంగళవారం చర్లపల్లి జైలుకు తరలించారు. తాండూరు రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, కరన్‌కోట్‌ ఎస్సై సంతోష్‌కుమార్‌లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం చెంగోల్‌ గ్రామానికి చెందిన వడ్డె వెంకటయ్య  ఆరు నెలలుగా తాండూరులోని రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి దొంగచాటుగా విక్రయిస్తుంటాడు. అక్టోబర్‌లో గౌతాపూర్‌ సమీపంలోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీ వద్ద ఓ ఇంట్లో అక్రమంగా బియ్యం విక్రయిస్తుండగా నిందితునిపై అప్పట్లో కేసు నమోదు చేసిపట్లు సీఐ తెలిపారు. వెంకటయ్య తిరిగి రెండోసారి బియ్యం విక్రయిస్తుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. మరోసారి బియ్యం విక్రయిస్తుండగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీల ఆదేశాల మేరకు వెంకటయ్యపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి నేరుగా చర్లపల్లి జైలుకు తరలించామన్నారు.

Updated Date - 2020-03-25T12:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising