కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో ఆదరణ
ABN, First Publish Date - 2020-08-04T10:03:04+05:30
కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో ఆదరణ లభిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి శేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి పేరాల శేఖర్
యాచారం: కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో ఆదరణ లభిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి శేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు బాషా వారిని రాష్ట్ర పార్టీ కార్యాల యంలో మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకందేలా ప్రతీ కార్యకర్త చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం బాషాను సన్మానించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మండలంలోని తక్కళ్లపల్లి, తక్కళ్లపల్లితండా ఉపసర్పంచ్లు విజయ్నాయక్, శ్రీశైలం కొప్పు బాషాను ఘనంగా సన్మానించారు.
Updated Date - 2020-08-04T10:03:04+05:30 IST