ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల్లో అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2020-11-26T06:03:24+05:30

ప్రజల్లో అవగాహన కల్పించాలి

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట: తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసేలా పారిశుధ్య సిబ్బంది  ప్రజల్లో అవగాహన కల్పించాలని మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ సూచించారు. బుధవారం శామీర్‌పేట మండలం తూం కుంట మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛసర్వేక్షణ్‌ 2020-21పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మున్సిపల్‌ పరిధిలో ఎక్కడ కూడా బహిరంగ మల విసర్జన జరుగకుండా చూడాలని ఆయన సిబ్బందికి చెప్పారు. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు మున్సిపల్‌ పరిధిలో హరితహారం, నర్సరీ మొక్కల పెంపకాన్ని, సంరక్షణ చర్యలను బాధ్యతగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఆర్‌ఐ గోపాల్‌రెడ్డి, పర్యావరణ ఇంజనీరు గణేష్‌, శానిటేషన్‌, హరితహారం సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T06:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising