ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిరణ్‌ హత్యకేసును తప్పుదోవ పట్టిస్తున్నారు

ABN, First Publish Date - 2020-08-04T10:02:12+05:30

మర్రిపల్లిలో దళిత యువకుడు కిరణ్‌ హత్యకేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


శంషాబాద్‌ రూరల్‌: మర్రిపల్లిలో దళిత యువకుడు కిరణ్‌ హత్యకేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అరోపించారు. సోమవారం శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినత్రిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిరణ్‌ హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్న ఏసీపీ, సీఐ, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరినట్లు తెలిపారు. హత్యకేసు ఫిర్యాదు ఇతరులతో ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రీ పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


అసలైన నిందితుడు ఏదుల మహేష్‌ను తప్పిం చేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పోలీసుల తీరు తన దృష్టికి వచ్చిన్నట్లు తెలిపారని, విచారణ జరిపి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటానని డీసీపీ హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆయన వెంట లక్ష్మినివాస్‌, శ్రీనివాస్‌, బాబు, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T10:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising