ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వేకు వచ్చిన అధికారులతో వాగ్వాదం

ABN, First Publish Date - 2020-12-18T04:49:09+05:30

సర్వేకు వచ్చిన అధికారులతో వాగ్వాదం

అధికారులతో వాగ్వివాదం చేస్తున్న కేశ్వాపూర్‌ రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట: నగరానికి తాగునీటి కోసం కేశ్వాపూర్‌లో చేపట్టిన రిజర్వాయర్‌కు సంబంధించి గురువారం సర్వేకు వచ్చిన అటవీశాఖ అధికారులతో భూములు కోల్పోతున్న రైతులు వాగ్వాదానికి దిగారు. గ్రామంలో దళిత రైతులు సాగు చేస్తున్న భూములు అటవీశాఖకు చెందినవని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని 118 సర్వే నెంబర్‌సుమారు 95 ఎకరాల భూముల్లో వందమంది దళితరైతులు సాగు చేసుకుటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఈ భూములకు తెలంగాణ  ప్రభుత్వం పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందినప్పటికీ అటవీ శాఖకు సంబంధించినవేనంటూ అధికారులు సర్వేకు రావటంతో కేశ్వాపూర్‌ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిహారం అందించేందుకు ఒప్పుకున్నా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నందున తమకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సర్పంచ్‌ ఇస్తారిని దళిత రైతులు కోరారు. సీఎంను కలిసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో గొడవ సద్దుమణిగింది.

Updated Date - 2020-12-18T04:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising