100కు డయల్ చేసి భర్త బాగోతాన్ని బయటపెట్టిన భార్య
ABN, First Publish Date - 2020-02-14T02:13:53+05:30
భర్త.. మరో యువతితో ఏకాంతంగా ఉండగా భార్య రెడ్హ్యాండ్గా పట్టుకుంది. పోలీసుల సాయంతో ఇద్దరి బాగోతం బయటపెట్టింది
వికారాబాద్: భర్త.. మరో యువతితో ఏకాంతంగా ఉండగా భార్య రెడ్హ్యాండ్గా పట్టుకుంది. పోలీసుల సాయంతో ఇద్దరి బాగోతం బయటపెట్టింది. అనంతరం ఆ యువతిని భార్య చితకబాదింది. ఈ ఘటన పరిగి టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మంకు చెందిన భవానీ అనే మహిళ.. సతీష్ భార్యాభర్తలు. అయితే సతీష్ మరొక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పరిగి టీచర్ కాలనీలో ఆ యువతితో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. 100కు డయల్ చేసి యువతిని, భర్తను రెడ్హ్యాండ్గా పట్టుకుంది. యువతి ఇంట్లో నుంచి బయటకు రాగానే సతీష్ భార్య బడితపూజ చేసింది. అనంతరం పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఇదిలా ఉంటే పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. మహిళా కానిస్టేబుల్ లేకుండా సదరు యువతిని ఇష్టారీతిగా పోలీసులు లాగడంపై విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు సతీష్ భార్య పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
Updated Date - 2020-02-14T02:13:53+05:30 IST