ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో నిర్బంధ వ్యవసాయం

ABN, First Publish Date - 2020-05-31T09:34:48+05:30

రాష్ట్రంలో ప్రభుత్వం నిర్బంధ వ్యవసాయం అమలు చేయడం దారుణమని బీజేపీ సీనియర్‌ నాయకులు శ్రీవర్దన్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర నేత శ్రీవర్దన్‌రెడ్డి


షాద్‌నగర్‌రూరల్‌ : రాష్ట్రంలో ప్రభుత్వం నిర్బంధ వ్యవసాయం అమలు చేయడం దారుణమని బీజేపీ సీనియర్‌ నాయకులు శ్రీవర్దన్‌రెడ్డి అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం వెలిజర్ల శివారులోని తోకరేగడితాండలో శనివారం ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో అనువైన పంటలు వేసుకుంటూ ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేస్తూ పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.


కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండానే నిర్భంధ వ్యవసాయం అమలుచేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలకు నష్టం కలిగించే నియంత్రిత వ్యవసాయ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్‌, ముకుందం, శ్యాంసుందర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, శ్రీనివా్‌సనాయక్‌, రవినాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-31T09:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising