చెన్నారెడ్డి సేవలు చిరస్మరణీయం
ABN, First Publish Date - 2020-12-03T05:11:11+05:30
చెన్నారెడ్డి సేవలు చిరస్మరణీయం
వికారాబాద్,(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ముఖ్య మంత్రి మర్రి చెన్నారెడ్డిసేవలు చిరస్మరణీయమని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, ప్రధానకార్యదర్శి ఎండీ తస్వర్అలీ అన్నారు. చెన్నారెడ్డి వర్ధంతిని పురస్కరించి బుధవారం ఎస్ఏపీ కళాశాల ఆవరణలోని ఆయన విగ్రహానికి వారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి హోదాలో చెన్నారెడ్డి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
కమలానగర్లో...
వికారాబాద్ : మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కమలానగర్ కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలెయాదయ్య, వికాస్ మండలి ఉపాధ్యక్షుడు వి.సత్యనారాయణ, కమాల్రెడ్డి, ఎంపీపీ చంద్రకళ,రమే్షకుమార్, కె.అనంత్రెడ్డి పాల్గొన్నారు.
ఎస్ఏపీ కళాశాలలో..
శ్రీఅనంత పద్మనాభ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మందారిక ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉపన్యాసకులు డి.నారాయణరావు, డి.నర్సింహారెడ్డి, శ్రీరాములు, ప్రభు, ఏవో పీవీ కుమార్, రేఖారాణి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-12-03T05:11:11+05:30 IST