ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సంక్షేమానికే బిల్లులు

ABN, First Publish Date - 2020-09-23T06:29:49+05:30

రైతుల సంక్షేమానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన బిల్లులు తెచ్చిందని బీజేపీ వికారాబాద్‌ పట్టణ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ  పట్టణ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి


వికారాబాద్‌: రైతుల సంక్షేమానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన బిల్లులు తెచ్చిందని బీజేపీ వికారాబాద్‌ పట్టణ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి అన్నారు. నూతన బిల్లులు అమలైన సందర్భంగా మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ చౌరాస్తాలో ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశ రక్షణతో పాటు దేశంలోని ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం అనేక  కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని అన్నారు. రైతులకు నచ్చిన ప్రదేశంలో ధాన్యాన్ని అమ్ముకోవడంతో పాటు ధర లేని సమయంలో వారి ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే సదుపాయాన్ని మోదీ సర్కారు కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివరాజ్‌, బుస శ్రీకాంత్‌, వివేకానందరెడ్డి, కేపీ రాజు, పాండు, పోకల సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-23T06:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising