ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు : డీఎల్పీవో
ABN, First Publish Date - 2020-11-01T06:49:07+05:30
ప్రభుత్వ స్థలాను ఆక్రమిస్తే చర్యలు తప్పవని డీఎల్పీవో అనిత తెలిపారు. శనివారం కులకచర్ల, బండవెల్కిచర్ల గ్రామాల్లో ఆమె పర్యటించారు.
కులకచర్ల: ప్రభుత్వ స్థలాను ఆక్రమిస్తే చర్యలు తప్పవని డీఎల్పీవో అనిత తెలిపారు. శనివారం కులకచర్ల, బండవెల్కిచర్ల గ్రామాల్లో ఆమె పర్యటించారు. కులకచర్ల పంచాయతీ సభ్యుల ఫిర్యాదు మేరకు చౌరస్తాలోని ఖాళీ స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఆ స్థలంలో గ్రామ పంచాయతీ బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీవో సుందర్కు ఆదేశించారు. అనంతరం బండవెల్కిచర్లలో పంచాయతీ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు సౌమ్యారెడ్డి, శిరీషారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-01T06:49:07+05:30 IST