రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ABN, First Publish Date - 2020-12-16T05:11:37+05:30
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మర్రిగూడ : నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం బట్లపల్లి గ్రామ శివారులో మం గళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంపట్నం మండలవాసి మృతిచెందాడు. అక్కడి ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్ర హీంపట్నం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన నడికుడి బిక్షపతి(48) బట్లపల్లి శివారులోని లక్ష్మణాపురం గేటు వద్ద బైక్పై అదపుతప్పి కిందపడి మృతి చెందాడు. బిక్షపతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2020-12-16T05:11:37+05:30 IST