స్వైన్ఫ్లూతో గాంధీ ఆస్పత్రికి గర్భిణి
ABN, First Publish Date - 2020-02-20T09:22:31+05:30
స్వైన్ఫ్లూతో మంగళవారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రిలో చేరిన గర్భిణి షెహనాజ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
- పట్టించుకోని నర్సులు.. ఇద్దరికి మెమోలు
అడ్డగుట్ట(ఆంధ్రజ్యోతి): స్వైన్ఫ్లూతో మంగళవారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రిలో చేరిన గర్భిణి షెహనాజ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. తల్లికి స్వైన్ఫ్లూ ఉండటంతో, బిడ్డ రక్త నమూనాలు ప్రయోగశాలకు పంపించారు. అయితే, అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రికి వచ్చిన షెహనాజ్ను సరిగ్గా పట్టించుకోకపోవడంతో మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఇద్దరు నర్సులకు మెమో జారీ చేశారు. కరీంనగర్ జిల్లా బిజిగిరిషరీఫ్కు చెందిన షెహనాజ్ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. వరంగల్లో పరీక్షలు నిర్వహించగా.. స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఆమెకు లేబర్ వార్డులో శస్త్రచికిత్స నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం షెహనాజ్తో పాటు మరొకరు స్వైన్ ఫ్లూ చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రెండు నెలల్లోనే రాష్ట్రంలో 49 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
Updated Date - 2020-02-20T09:22:31+05:30 IST