ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమృత ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు

ABN, First Publish Date - 2020-03-08T17:21:44+05:30

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానస్పద స్థితిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


అయితే.. మారుతీరావు ఆత్మహత్యతో మిర్యాలగూడలోని అమృత ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదివరకే అమృత ఇంటికి జిల్లా ఎస్పీ సెక్యూరిటీ కల్పించిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో మరింత భద్రత పెంచారు. మారుతీరావు ఆత్మహత్యతో ఆయనకు సంబంధించిన అనుచరులు, బంధువులు.. అమృత ఇంటిపై దాడికి పాల్పడతారనే అనుమానంతో ముందస్తుగా భద్రత పెంచినట్లు తెలుస్తోంది.


కాగా.. ఇదివరకే మారుతీరావు ఆత్మహత్యపై ఇదివరకే అమృత స్పందించింది. ‘ప్రణయ్‌ను హత్య చేశానని మా నాన్న పశ్చాతాపం చెంది ఉంటాడు. నాన్న ఆత్మహత్యపై మాకు క్లారిటీ లేదు. అన్ని వివరాలు తెలిసిన తర్వాత స్పందిస్తాను’ అని అమృత మీడియాకు వెల్లడించింది.

Updated Date - 2020-03-08T17:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising