నేటి నుంచి పీజీ మెడికల్ ప్రవేశ ప్రక్రియ
ABN, First Publish Date - 2020-04-10T11:41:01+05:30
నేటి నుంచి పీజీ మెడికల్ ప్రవేశ ప్రక్రియ
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): అఖిల భారత కోటాలో పీజీ మెడికల్ ప్రవేశ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కాలేజీల సీట్ల కేటాయింపు వివరాలను ఆన్లైన్లో శుక్రవారం విడుదల చేస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కేటాయించిన కోర్సు, కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఈ నెల 20 వరకూ గడువు విధించారు. లాక్డౌన్ కారణంగా వెళ్లడానికి వీలుపడకపోతే ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు.
Updated Date - 2020-04-10T11:41:01+05:30 IST