కొనసాగుతున్న అల్పపీడనం
ABN, First Publish Date - 2020-09-16T10:25:43+05:30
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం ..
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం అల్ప పీడనంగా మారింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Updated Date - 2020-09-16T10:25:43+05:30 IST