భర్తను హతమార్చిన భార్య
ABN, First Publish Date - 2020-06-04T10:32:05+05:30
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబం(ఆర్)లో దారుణం చోటు చేసుకుంది.
సహకరించిన కొడుకు
రుద్రూరులో దారుణం
వర్ని(రుద్రూరు), జూన్ 3 : నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబం(ఆర్)లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, కొడుకు చేతి లో బుధవారం ఉదయం కుంజరి గంగారం (58) హత్యకు గురయ్యాడు. వి వరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గంగారం, సాయవ్వ దంపతులకు ముగ్గు రు కొడుకులు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గంగారం పోషిస్తున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి కూడా గ్రామ శివా రులోని పొలం వద్ద వేసుకున్న పాకలో నిద్రపోతున్నాడు. పెద్ద కుమారుడు గంగాధర్, భార్య సాయవ్వలు రాత్రి అక్కడికి చేరుకొని పతకం ప్రకారం గం గారం తలపై కర్రలతో బాది హతమర్చారు.
స్థానికుల సమాచారం మేరకు బోధన్ ఏసీపీ జైపాల్రెడ్డి, రుద్రూరు సీఐ అశోక్రెడ్డి, ఎస్సై రవీందర్లు అక్క డికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరి యా ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన హతుడి కుమారుడు గం గాధర్, భార్య సాయవ్వలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి అ క్రమ సంబంధం కలిగి ఉన్నాడని, చెడు తిరుగుళ్లకు అలవాటు పడడంతో హతమార్చినట్లు చిన్న కుమారుడు చంద్రకాంత్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీ ఐ అశోక్రెడ్డి వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.
Updated Date - 2020-06-04T10:32:05+05:30 IST