యూనివర్సిటీ వసతిగృహాలు తెరవాలి
ABN, First Publish Date - 2020-10-04T10:29:09+05:30
ప్రస్తుత కరోనా నేపథ్యం లో విద్యావ్యవస్థ అతలాకుతలమైందని, ఈ కార ణంగా యూనివర్సిటీ విద్యార్థులు ఆన్లైన్ క్లాస్లు
రిజిస్ర్టార్కు మెయిల్ ద్వారా ఏబీవీపీ వినతి
డిచ్పల్లి, అక్టోబరు 3: ప్రస్తుత కరోనా నేపథ్యం లో విద్యావ్యవస్థ అతలాకుతలమైందని, ఈ కార ణంగా యూనివర్సిటీ విద్యార్థులు ఆన్లైన్ క్లాస్లు నష్టపోకుండా విశ్వవిద్యాలయం పరిధిలోని వసతి గృహాలను తెరవాలని కోరుతూ ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు రవికాంత్, కార్యదర్శి భానుకుమార్ కోరారు. ఈ మేరకు రిజిస్ర్టార్కు మెయిల్ ద్వారా శనివారం పంపిన వినతిపత్రం కాపీని శనివారం విలేకరులకు అందజేశారు. క్లిష్ట సమయంలో విద్యార్థుల కుటుంబాలు తీవ్ర ఇబ్బం దుల్లో ఉన్నాయని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వసతిగృహాలను తెరిపించేలా రిజిస్ర్టార్ చర్యలు తీసుకోవాలని కోరారు. దూర ప్రాంతం నుంచి పరీక్షలకు తరలిరానున్న పీజీ విద్యార్థులకు రవాణా ఖర్చులు తడిపిమోపెడవుతాయని, విద్యా ర్థుల శ్రేయస్సు దృష్ట్యా వసతిగృహాలను వెంటనే తెరవాలన్నారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు.
Updated Date - 2020-10-04T10:29:09+05:30 IST