ట్రాన్స్జెండర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ
ABN, First Publish Date - 2020-05-28T10:59:11+05:30
బీజేపీ రాష్ట్ర నాయకుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పెళ్లిరోజు సందర్భంగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్
పెద్దబజార్, మే 27: బీజేపీ రాష్ట్ర నాయకుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పెళ్లిరోజు సందర్భంగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ నగరంలోని మార్వాడిగల్లీలో ట్రాన్స్జెండర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నుంచి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు.. అవసరం ఉన్న వారికి తమ ట్రస్ట్ అన్ని విధాలుగా సేవ చేయడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అన్నారు. కార్యక్రమంలో ధన్పాల్ ప్రణయ్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఇల్లెందుల ప్రభాకర్గుప్తా, బేకన్ మధు, అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-28T10:59:11+05:30 IST