ఎస్సారెస్పీ 26 గేట్ల ఎత్తివేత
ABN, First Publish Date - 2020-10-16T07:19:36+05:30
శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తోందని
ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న లక్ష క్యూసెక్కుల వరద
లక్షా 50 వేల క్యూసెక్కుల మిగులు జలాలు గోదావరిలోకి విడుదల
మెండోర, అక్టోబరు 15: శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో 26గేట్లు ఎత్తి లక్షా 50 వేల క్యూసెక్కుల మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నట్టు ఈఈ తెలిపారు. అలాగే ప్రాజెక్టు ఐదు ఎస్కేప్ గేట్ల ద్వారా 5,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కులు, లక్ష్మీకాలువ ద్వారా 300క్యూసెక్కులు, వరద కాలువకు 3,000 క్యూసెక్కులు, మిషన్ భగీరథ పథకానికి 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ఈఈ రామా రావు వివరించారు.
Updated Date - 2020-10-16T07:19:36+05:30 IST