రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2020-11-26T06:17:55+05:30
బీర్కూర్ మండలం చించొల్లి గ్రామ సమీపంలోని బారెడు పోచమ్మ ఆలయం సమీపంలో బుధవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనలో కొవ్వూరి శ్రీను (38) అనే వ్యక్తి మృతిచెందాడు.
బీర్కూర్, నవంబరు 25: బీర్కూర్ మండలం చించొల్లి గ్రామ సమీపంలోని బారెడు పోచమ్మ ఆలయం సమీపంలో బుధవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనలో కొవ్వూరి శ్రీను (38) అనే వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ సతీష్వర్మ వివరాల మేరకు బీర్కూర్కు చెందిన శ్రీనివాస్ అనే తాపీ మేస్ర్తీ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారం రోజుల కిందట ఆరుగురు కూలీలను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నాడు. వీరిలో శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధిత మేస్త్రీ వద్ద పనిచేయడం నచ్చక తిరిగి విజయవాడకు వెళ్లిపోయేందుకు మేస్ర్తీకి చెప్పకుండా మంగళవారం అర్ధరాత్రి బీర్కూర్ నుంచి బాన్సువాడకు వెళుతున్న క్రమంలో చించొల్లి గ్రామ సమీపంలోని బారెడు పోచమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని ఎస్ఐ తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహించి తిరిగి స్టేషన్కు వస్తున్న సమయంలో రోడ్డు పక్కన పడి ఉన్న శ్రీనివాస్ను గుర్తించామన్నారు. ఆస్పత్రికి తరలించాలని భావించినా, అప్పటికే మృతిచెందాడన్నారు. అనంతరం మృతదేహాన్ని బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Updated Date - 2020-11-26T06:17:55+05:30 IST