మహిళ ముక్కు, చెవులు కోసి మరీ..
ABN, First Publish Date - 2020-10-29T20:14:31+05:30
జిల్లాలోని బోధన్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది.
నిజామాబాద్: జిల్లాలోని బోధన్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. రాకాసిపెట్కు చెందిన లక్ష్మీ(55) అనే మహిళ ముక్కు, చెవులు కోసి మరీ బంగారు నగలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు బోధన్ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్న మహిళగా గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు స్పృహ కోల్పోయిన మహిళను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2020-10-29T20:14:31+05:30 IST