చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2020-12-29T05:46:30+05:30
మండలంలోని గాంధీనగర్కు చెందిన ఆదినారాయణ (45) జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడని ఎస్ఐ యాకూబ్ తెలిపారు.
నవీపేట, డిసెంబరు 28: మండలంలోని గాంధీనగర్కు చెందిన ఆదినారాయణ (45) జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడని ఎస్ఐ యాకూబ్ తెలిపారు. ఈ నెల 23న పురుగుల మందు తాగిన ఈయనను వెంటనే 108లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడన్నారు. ఈయనకు భార్య బంగారమ్మ, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈతని భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Updated Date - 2020-12-29T05:46:30+05:30 IST