వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN, First Publish Date - 2020-04-05T11:16:56+05:30
కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కోవిడ్-19 టీంలో వైద్యసేవ లు అందించేందుకు అర్హులైన వైద్యులు ధరఖాస్తు చేసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్కుమార్ తెలిపారు.
కామారెడ్డిటౌన్, ఏప్రిల్ 4: కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కోవిడ్-19 టీంలో వైద్యసేవ లు అందించేందుకు అర్హులైన వైద్యులు ధరఖాస్తు చేసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని, ఆసక్తి గలవారు హజరు కావాలని పేర్కొన్నారు. వైద్యుల చీటి లేనిది జలుబు, దగ్గు మందులు అమ్మరాదని ఉమ్మడి జిల్లాల ఔషద నియంత్రణశాఖ సహయ సంచాలకులు రాజ్యలక్ష్మీ పేర్కొన్నారు. తీవ్రమైన జలుబు, దగ్గు, శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతూ ఆయా మెడికల్ కేంద్రాలకు వస్తే ఆసుపత్రిలకు వెళ్లెలా ప్రోత్సహించాలని, నిబంధనలను అతిక్రమించి మందులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2020-04-05T11:16:56+05:30 IST